సృజనాత్మకత
అంతర్గత సౌందర్యాన్ని వ్యక్తపరుచుట
తన జీవితాంతం మరియు పనిలో, శ్రీ మాతాజీగారు కళలను ప్రోత్సహించడానికి చాలా సమయాన్ని మరియు శక్తిని వెచ్చించారు. ప్రపంచ సంస్కృతులను వ్యక్తీకరించే మరియు పోషించే సూత్రాలలో ఒకటిగా ఆమె వాటిని చూసారు. ప్రత్యేకించి, ఆమె తన స్థానిక భారతదేశంలోని గొప్ప, పురాతన కళాత్మక సంప్రదాయాలను కాపాడాలని కోరుకున్నారు మరియు ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రచారాన్ని చురుకుగా ప్రోత్సహించింది.

2003లో శ్రీ మాతాజీగారు తన సోదరుడి సహాయంతో (బాబామామ అని ప్రేమగా పిలుస్తారు), భారతదేశంలోని మహారాష్ట్రలో కళాకేంద్రాన్ని స్థాపించారు. ఈ ప్రశాంతమైన గ్రామీణ నేపధ్యంలో భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యం మరియు చిత్రలేఖనం నేర్చుకోవడానికి విద్యార్థులు ప్రపంచం నలుమూలల నుండి వస్తారు. శ్రీ మాతాజీగారు వ్యక్తిగతంగా PK సాల్వే ఆర్ట్స్ అకాడెమీ యొక్క నిర్మాణ సంబంధమైన రూపకల్పనకు మార్గనిర్దేశం చేశారు, అలాగే ఢిల్లీలోని నిరాశ్రయులైన మహిళలు మరియు అనాథ పిల్లల కోసం విశ్వ నిర్మల ప్రేమ్ సెంటర్తో సహా మానవతా ప్రయోజనాల కోసం నిర్మించిన ఇతర భవనాల నిర్మాణాన్ని రూపొందించారు.
ఆమె చేతితో తయారు చేసిన వస్తువుల ప్రాముఖ్యతను గుర్తించారు మరియు మహాత్మా గాంధీ సంప్రదాయంలో ఆమె భారతదేశ ఆర్థిక మరియు సాంస్కృతిక జీవితానికి కీలకమైన కుటీర పరిశ్రమలకు స్థిరంగా మదత్తునిచ్చారు.
సంవత్సరాలుగా, శ్రీ మాతాజీగారు భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖులను ఆదరించారు, వారిని కచేరీలు మరియు కార్యక్రమాలలో ప్రదర్శించడానికి ఆహ్వానించారు. ఆమె సమక్షంలో ప్రదర్శన ఇచ్చిన చాలా మంది తమ కళాత్మక అభివృద్ధిలో ఇది ఒక పరివర్తన ఘట్టంగా అభివర్ణించారు. ఆమె బలమైన సృజనాత్మక శక్తి వారి స్వంత సృజనాత్మకత మరియు పనితీరు నైపుణ్యాన్ని పెంచిందని వారు కనుగొన్నారు.
ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, దేబు చౌదరి మరియు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మొదలగువారు శ్రీ మాతాజీగారు ఆహ్వానం మేరకు ప్రదర్శించిన ప్రసిద్ధ కళాకారులలో కొందరు మాత్రమే. ఆమె స్వయంగా పుస్తకాలు, భజనలు (భారతీయ భక్తి గీతాలు) మరియు పద్యాలు రాసారు.
శ్రీ మాతాజీగారు కళలను పెంపొందించడంలో థియేటర్కు బలమైన మద్దతు ఉంది. థియేటర్ ఆఫ్ ఎటర్నల్ వాల్యూస్గా సహకరించమని ఆమె ప్రతిభావంతులైన థియేటర్ ప్రదర్శకుల బృందాన్ని ప్రోత్సహించారు. 1993లో బెల్జియంలోని ఘెంట్లో ఏర్పడిన ఈ బృందం ఇప్పటికీ అంతర్జాతీయంగా పర్యటిస్తుంది, వారి ప్రేక్షకులలో స్వీయ-అవగాహన మరియు ఆధ్యాత్మికతను ప్రేరేపించే నాటక రచయితలచే రచనలను ప్రదర్శిస్తుంది.
కల్చర్ ఆఫ్ ది స్పిరిట్ ఫెస్టివల్ మరియు ఇంటర్నేషనల్ నిర్మల్ ఆర్ట్స్ అకాడమీ వంటి విద్యాపరమైన మరియు కళాత్మక ప్రాజెక్ట్లలో నైపుణ్యాన్ని అందించడానికి పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కంపెనీలు మరియు కమ్యూనిటీతో థియేటర్ ఆఫ్ ఎటర్నల్ వాల్యూస్ కూడా పని చేస్తుంది, ఇది ఇటలీలోని పీమోంటేలో ప్రతి సంవత్సరం జరుగుతుంది.

భారతదేశ పురాతన యోగా సంప్రదాయం ప్రకారం, మానవుడు ఏడు ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంటాడు. వీటిలో రెండవది సృజనాత్మకత యొక్క సూత్రం, ఇది లేకుండా ఆత్మ-సాక్షాత్కారం లేదా స్వీయ-అవగాహన సంభావ్యత చాలా పరిమితంగా ఉంటుంది, లేదా అసాధ్యం. ఈ కారణంగా, శ్రీ మాతాజీగారు ఆమె సందర్శించిన అన్ని దేశాల్లోని వ్యక్తులు మరియు సంఘాల సృజనాత్మక శక్తులను మేల్కొల్పడానికి ప్రయత్నించారు.